ఒకసారి నారధుడు కైలాసానికి ప్రయామౌతూ మంచి మామిడిపండు కైలాసానికి తీచ్చాడు. అక్కడ ఆడుకుంటున్న గణపతికిని, కుమారస్వామిని పిలిచాడు. ‘‘ ఏమి నారాధ’’! అని వచ్చిన గణపతి నారుధుని చేతిలోని పండుని చూసి దాన్ని లాక్కొబోతుండగా కుమారస్వామి వచ్చి ‘ఆ పండు నాదంటే నాదని’ ఇద్దరూ పొట్లాడుకోసాగారు.
అప్పడు నారధుడు ‘‘ మీ ఇద్దరికీ ఓ పోటీ పెడుతున్నాను, అందులో ఎవరు గెలిస్తే వారికే ఈ పండు’’ అని అన్నాడు. ఇంకేముంది కుమారస్వామి నెమలి వాహనంతో వచ్చి ‘‘ ఏమిటో త్వరగా శెలవివ్వండి స్వామీ! అని అడిగాడు. ఈ ప్రపంచంలోని భూమంతటనీ ఎవరు చుట్టి వస్తారో వారికే ఈ పండునిస్తాను అన్నాడు నారధుడు.
ఇక కుమారస్వామి నాదే విజయం అని హుషారుగా నెమలిపై ముందు బయల్తేరాడు. వినాయకుడు ‘‘ గౌరీ శంకరా’ అని పిల్చాడు. వెంటనే అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యేక్షమయ్యారు. వారి ఇరువురి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించడంతో కుమారస్వామి ఎక్కడికెళ్లినా అతడికన్నా ముందు వినాయకుడు వెళ్తున్నట్లు కన్పించింది.
వెంటనే నారుధుడు మామిడి పండును వినాయకుడిది బుద్దిబలం కుమారస్వామిది శక్తిబలం. ఈ కథలోని నీతి : శక్తి బలం కన్నా బుద్దిబలం ఎంతో గొప్పది.
మరింత సమాచారం తెలుసుకోండి: